నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 09 : అన్నమయ్య జిల్లా,పుంగనూరు టీటీడీ పరిధి లోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన సి.కృష్ణమూర్తి ఇటీవల బదిలీ పై తిరుపతి లోని జెఈఓ (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా శనివారం టిటిడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నకు వచ్చిన క్రిష్ణమూర్తి ని కలసిన భక్తులు మాట్లాడుతూ ఆలయం లో దసరా బ్రహ్మోత్సవాలు, స్వామి వారి కైంకార్యాలు, శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం లో పూజల నిర్వహణ, భక్తులలో భక్తి శ్రద్దలను పెంపొందించేల విధులు నిర్వహించడం ను కొనియాడారు. అనంతరం ఆయనను భక్తులు, మిత్రులు కలసి ఆయనను ఘనంగా సన్మానిచడం జరిగింది.సన్మాన కార్యక్రమం లో భక్తులు టీవీఏస్ ప్రసాద్,అమరావతి సురేష్,చంద్రశేఖర్ రాజు,సతీష్ రాజు,రాఘవేంద్ర,భూపాల్ రాజు,ఆలయ ఇన్స్పెక్టర్ యస్వంత్,సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News