Monday, 27 July 2026 12:51:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Date : 30 January 2026 09:03 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలికిరి - జనవరి 30 : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలికిరి మండలం మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి సంబంధించిన ఓపి రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రిజిస్టర్ లను పరిశీలించి ఆసుపత్రి సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగారు. చిన్న పిల్లలకు వేసే టీకాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారా లేదా టీకాలు వేసే తేదీలపై ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నారా లేదా వంటి ప్రశ్నలను ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. సిబ్బంది కొరత ఏమైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపి పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండాలని, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆపరేషన్ జరిగేలా చూడాలన్నారు. స్త్రీలలో రక్తహీనత లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల నేటి వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలపై సిబ్బందిని అడిగి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వసతులు బాగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :