నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 : తంబళ్లపల్లె కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీకి త్వరలో పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. మంగళవారం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, రాజంపేట టిడిపి రైతు నాయకుడు ముద్దలదొడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు. తంబళ్లపల్లె లో పార్టీ దుస్థితిపై ఆయనకు మండల నాయకులు కూలంకషంగా వివరించి పార్టీని గాడిలో పెట్టి కార్యకర్తలను ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పందించి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని తంబళ్లపల్లె లో పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ప్రతి కార్యకర్త అధైర్యపడాల్సిన పని లేదని ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి మీకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
Reporter
Namitha News