నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : మదనపల్లి పట్టణం లో శ్రీ చందు ఆధ్వర్యంలో బహుజన సేన 3వ వార్షికోత్సవ సమావేశం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ IAS@ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఏకమవ్వాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చిత స్థితి దళిత క్రైస్తవ సమాజంలో ఏర్పడిందని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రాజ్యాంగ హక్కులు వర్తించేలా మన పోరాటం ముందుకు సాగాలని తెలియజేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తీర్పు ఇవ్వడం అహేతుకమని క్రిస్టియన్ సమాజాన్ని అవమానించడమేనని వీరు తెలియజేశారు. రాజ్యాంగం లోని అంశాలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండాలే కానీ వ్యక్తిగత అజెండాను జడ్జిమెంట్లో చూపించడం బాధాకరమని వీరు ఆవేదన చెందారు.శ్రీ చందు గారు మాట్లాడుతూ దళిత క్రిషియన్లకు ఎస్సీ హోదా కలిపించక పోతే భవిషత్తులో అన్ని వర్గాలను కూడగట్టి ఉద్యమం కార్యాచరణకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.పీటీఎం శివ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు రాజ్యాంగ బద్ధ పదవిలో వుండి క్రిస్టియన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురాం కృష్ణంరాజు పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు యనమల సుదర్శనం,భారతీయ అంబేద్కర్ సేన అధ్యక్షులు పీటీఎం శివ గారు,MRPS అన్నమయ్య జిల్లా అధ్యక్షులు Y.రవి మాదిగ,CPI కృష్ణప్ప,CPM ,క్రిస్టియన్ పాస్టర్స్ భక్త,అబ్రహామ్,న్యాషి,డేవిడ్ రాజు,మీరాకుమారి, రతీష్,ఏఎంసీ రవీంద్ర.మరియు బహుజన సేన నాయకులు వి.భాను ప్రకాష్,M.వెంకటేష్,హరి,రెడ్డి శేఖర్,కుప్పం సతీష్,గోవిందు,మనీ ప్రకాష్,అశోక్,శ్యామ్ మరియు పెద్దయెత్తున యువతి యువకులు మహిళలు పాల్గొన్నారు
Reporter
Namitha News