నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి - ఫిబ్రవరి 06 : శుక్రవారం ఉదయం సర్వేపల్లి మండలం లోని వండాడి గ్రామపంచాయతీ లోని తూర్పుపల్లె లో నిర్వహించబడుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ తదితర వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025 నుండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మొత్తం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక, విద్య, ఉద్యోగ, వివరాలను ప్రత్యేక ఆప్ లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ సమాచారం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడంతోపాటు యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు
Admin
Namitha News