నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మే 21 : మదనపల్లి పట్టణం సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగాల ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరుకు చెందిన హెచ్సీఎల్ గువి సంస్థ, డైరెక్టర్ లక్ష్మణన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హెచ్సీఎల్ గువి సంస్థ వారి ఆధ్వర్యంలో హెచ్సీఎల్ గువి ట్రైనర్లు విద్యార్థులకు జావా మరియు పైథాన్ ప్రోగ్రామింగ్ భాషలపై నెల రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు జావా, పైథాన్ ఆధారిత ప్రోగ్రామింగ్ టాస్కులు, కోడింగ్ సమస్యలు మరియు రియల్ టైమ్ అప్లికేషన్ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్ కార్యకలాపాలను అప్పగించి వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచారని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి పలు ఆధునిక సాంకేతిక రంగాలలో రూపొందించిన సమస్యలకు విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అందించారని తెలిపారు. మొత్తం 30 బృందాలు పాల్గొన్న ఈ హ్యాకథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి 10,000/-, రెండవ బహుమతి 5,000 /- మరియు మూడవ బహుమతిగా 3,000/- నగదు మరియు సర్టిఫికెట్స్ ను విద్యార్థులకు అందజేశారు. విద్యా జ్ఞానం మరియు పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో సహాయసహకారాలు అందించిన మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పనా, డాక్టర్ ఎస్.పద్మ, డాక్టర్ చొక్కనాథన్, కోఆర్డినేటర్స్ శాయీజ్ అహమ్మద్, ఉష, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News