నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో రెండు మాసాల క్రితం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి ప్రయోగాత్మకంగా ప్రకృతి పెరటి తోట పెంపకం ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ ఎంఈఓ త్యాగరాజు సూచనలతో ప్రకృతి ఎరువులతో పెరటి తోట పెంపకం చేపట్టి సత్ఫలితం సాధించారు. శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, కోసువారిపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సాదియాలు పెరటి తోటలోని పండిన పంటను చూసి పరవశించిపోయారు. తోటలో పండిన ముల్లంగి, ఆకుకూరలను పరిశీలించి మోడల్ స్కూల్ సిబ్బందిని ప్రశంసించారు. రసాయన ఎరువులతో పండిన పంటలతో ఆరోగ్యాలు క్షీణిస్తాయని మోడల్ స్కూల్ లో ప్రకృతి జీవన ఎరువులు తో పండించిన వ్యవసాయ పంట అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు కొనియాడారు. మోడల్ స్కూల్ పెరటి తోట ఓ రోల్ మోడల్ గా నిలిచిందని వీరిని ఆదర్శంగా తీసుకొని పాఠశాలు, సచివాలయాలు, ఇంటి పెరడులు, రైతులు ప్రకృతి వ్యవసాయ పంటలపై దృష్టి సారిస్తే జిల్లాకే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా వారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బందిని ప్రశంసించారు. వారి వెంట వైద్య సిబ్బంది, మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News