నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని సచివాలయం పనులు పూర్తిగా కాక అసంపూర్తిగా ఉంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన నాటి నుండి ఎంపీడీవో కార్యాలయం పై రూములో సచివాలయాన్ని కొనసాగిస్తున్నారు. సచివాలయ పనుల కోసం వచ్చే ప్రజలు రెండో అంతస్థులోని కార్యాలయానికి వెళ్లడానికి పడరాని పాట్లు పడుతున్నారు. సచివాలయ కాంట్రాక్టర్ తనకు బిల్లులు రావాల్సి ఉందని బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తిచేసి అప్పజెప్తానని చెప్తున్నాడు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయ అధికారులు సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కార్యాలయం మార్చడానికి ప్రభుత్వ ఖాళీ భవనాల అన్వేషణలో పంచాయతీ అధికారులు ఉన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సచివాలయ పనులు పూర్తి కావడానికి సహకరించాల్సి ఉంది.
Reporter
Namitha News