నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 : మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 35 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రములుగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తో ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించిన అంగన్వాడీ కార్యకర్తలు. వారికి ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసి తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేయడం తో నెలకు రూ 7000 /- జీతం పొందుతున్న మినీ అంగన్వాడి కార్యకర్తలు మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్పు వలన రూ 11500 /-రూపాయల జీతం అందుకుంటారని అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలు మొబైల్లో యాప్ ల నందు వివిధ రకాల డేటా చేస్తున్నందున వారికి మెరుగైన సమర్థవంతంగా పనిచేయగలరని రాష్ట్ర ప్రభుత్వం వారు 5G స్మార్ట్ ఫోన్ లను ఇవ్వటం జరిగినది. ఈ మొబైల్స్ లో 4G Ram, 64GB స్టోరేజ్ ఉంటుంది. కావున మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు అప్గ్రేడేషన్ ఉత్తర్వులు మరియు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను అంగన్వాడి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలని, అంగన్వాడీకి వచ్చే పిల్లలను తల్లి కంటే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమానికి సిడిపిఓ నాగవేణి, ఏసిడిపిఓ డాక్టర్ సునీత, సెక్టార్ సూపర్వైజర్లు, బిపిసి మరియు అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు
Admin
Namitha News