నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 20 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి. కుమార్ కు ప్రతిష్టాత్మకమైన “ సిస్కో ఇన్స్ట్రక్టర్ లీడర్షిప్ అవార్డు – 2026 ”ను అందుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఇండియా లీడర్షిప్ సమ్మిట్ – 2026 కార్యక్రమం లో సిస్కో సిస్టమ్స్ ఇంక్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ద్వారా లీడ్ ఇన్స్ట్రక్టర్గా డాక్టర్ సి.కుమార్ మిట్స్ యూనివర్సిటీ నందు నెట్వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విద్యార్థులకు విశిష్టమైన శిక్షణ అందిస్తూ అకాడెమిక్ విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ అవార్డు సాధించడం మిట్స్ యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు అందుకున్న డాక్టర్ సి కుమార్ ను ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గౌర్, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు
Admin
Namitha News