నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లి సర్వజన ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చిన వారికి అందుతున్న వైద్య సేవలు , సిబ్బంది ప్రవర్తన పై, హాస్పటల్, వైద్య పరీక్షల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఆసుపత్రి లో అందుబాటులోనున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని, వారి పట్ల, వారి సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, వైద్యం అధించే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు, ఉపేక్షించేది లేదని తెలుపుతూ రోగులకు మరింత వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని, మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
Reporter
Namitha News