Monday, 27 July 2026 10:53:26 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ లో ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ పై వర్కుషాప్

Date : 12 March 2026 05:16 PM Views : 278

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 12 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గుంటూరు లోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సజ్జ తులసి క్రిష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది ఒక ఇంటర్నెట్ అప్లికేషన్‌లో ఫ్రంట్‌ఎండ్ యూజర్ చూసే భాగం మరియు బ్యాక్‌ఎండ్ లో డేటాబేస్, సర్వర్, లాజిక్ వంటి రంగాలలోనూ పనిచేయగల సాంకేతికత అని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ నైపుణ్యానికి భారీ డిమాండ్ పెరగడం ద్వారా ఫుల్ స్టాక్ డెవలపర్లు ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్ రెండింటినీ నిర్వహించగలగడం వల్ల టీమ్‌పై ఆధారపడటం తగ్గి, ప్రాజెక్ట్ నిర్వహణ వేగంగా పెరుగుతోందని అన్నారు. విద్యార్థులకు ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ అవగాహన ఉండటం వల్ల ఒక అప్లికేషన్ ఎలా రూపుదిద్దుకుంటుంది, డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది, యూజర్‌కు ఎలా కనిపిస్తుంది అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్ట్‌ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, ఒక్కరే ఒక టీమ్‌లా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకే ఐటి రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్ కె.మొహమ్మద్, డాక్టర్ చొక్కనాథన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :