నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె కు సమీపంలోని శ్రీ మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి కాలినడకన చేరుకున్నారు. ఉదయం తన సహ ధర్మచారిని కల్పన రెడ్డి తో పాటు తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కొండ కింద మదాతం బావి వద్ద వినాయక, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కాలినడకన కొండకు బయలుదేరి మధ్యలో వెలుగు మల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జయచంద్ర రెడ్డి దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజానీకం పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా గౌరీ మాత ఆలయం, భగీరథి, ఎలకతీర్థం లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ చంద్రారెడ్డి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News