నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 28 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజనం తోబాటు వైభవంగా పుష్ప యాగం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారితో బాటు శ్రీదేవి భూదేవి ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు తిరుమల నుండి తెప్పించిన పలు రకాల పుష్పాల ను అలంకరించారు. ఉదయం స్వామివార్లకు తిరు మంజనం గావించి. తదుపరి పాలు రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవా కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణతో కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా మహిళలు, భక్తులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి పుష్ప యాగాన్ని సందర్శించి తరించారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి అర్చకుల బృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, నగేష్, మురళి మారుమూల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు
Reporter
Namitha News