Monday, 27 July 2026 02:13:40 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్యకొండ మల్లిఖార్జున స్వామి ని దర్శించుకొన్న శ్రీరామ్ చినబాబు

Date : 15 February 2026 05:10 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 15: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాల మధ్య ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, భక్తులు భక్తి శ్రద్ధలతో శివారాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, రన్ టీవీ చైర్మన్ సిరివెలు చరణ్, టిడిపి నాయకులు తులసీదర్, చంద్రశేఖర్, ఈశ్వర, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, జెసి రెడ్డప్ప, బిజెపి నాయకులు శ్రీకాంత్, రాయల్, చంటి రాయల్, విష్ణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి శివనామ స్మరణ చేస్తూ మల్లికార్జున స్వామి సేవ లో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :