నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - డిసెంబర్ 08 : అన్నమయ్య జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు ఎం. భాను గోపాల్ రాజు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గడికోట గ్రామపంచాయతీలో పలు పల్లెలలో విస్తృతంగా తెదేపా నాయకులతో కలిసి కలయితిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు .మొదట బోడం రాజుగారి పల్లెలో కార్యకర్తలతో సమావేశమయ్యారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ,అభివృద్ధి నీ ప్రజల లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అలాగే వైసిపి చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అందరికీ తెలియజేయాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని అందరికీ తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వేల్పుల మిట్ట, ఎర్రపాపి రెడ్డిగారి పల్లి, ఎర్ర పాపి రెడ్డి గారి పల్లె ఎస్ సి కాలనీ ,పేరయ్య గారి పల్లి ఎస్సీ కాలనీలలో పర్యటించి అక్కడ ప్రజలనడిగి సమస్యలను తెలుసుకున్నారు .మంచినీటి సమస్య, రోడ్లు, వీధిలైట్లు ,పింఛన్లు, భూమి సమస్యలు వంటి వాటిని ప్రజలు వారు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యలను ఒక్కొక్కటిగా అన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు సురేంద్ర రెడ్డి, నాగసుబ్బయ్య నాయుడు, మట్లి సర్పంచ్ నాగార్జున చారి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజరాజు, సీతారామరాజు, బిజెపి నాయకులు నరేంద్ర, విజయ భాస్కర్, యువ నాయకులు,సికిందర్, రాజేంద్ర రాజు, భూపతి ,రామ్మోహన్, దుర్గం ఆంజనేయులు ,మదనపల్లి సుధాకర్, రమణ, సీకే రామ్మోహన్ రాజు, మాద రామసుబ్బారెడ్డి, మాదా రవి రెడ్డి, భూపతి రాజు, ఎం మధుసూదన్ రాజు, వంగమల్ల ప్రసాద్ రాజు, నాగప్ప నాయుడు, రామ్మోహన్, శివ,రామానుజులు, అలీ, రాజా ,ఎల్లయ్య, బాలకృష్ణ, రమణ, ఎం. జి ప్రభాకర్ రాజు, కళ్యాణ్ బాబు ,మురళి ,వేల్పుల వెంకటరమణ, రాహుల్ రెడ్డి, సుబ్బయ్య, నాగరాజా,సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News