నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : తంబళ్లపల్లె మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఏవో థామస్ రాజా సూచించారు. బుధవారం ఆయన మండలంలోని కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని 22 అంశాలకు చెందిన ప్రశ్నావళిని పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని మీరు చేసే ఈ సర్వే ద్వారా కుటుంబంలోని ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు అవుతుందని ఈ సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, వెంకటేశ్వర ప్రసాద్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News