Sunday, 26 July 2026 01:12:43 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎన్‌హెచ్‌-71 పెండింగ్ పరిహార చెల్లింపుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

ప్రభావిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు - జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ

Date : 29 May 2026 08:28 PM Views : 56

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామ పరిధిలో మదనపల్లి – పీలేరు సెక్షన్‌కు సంబంధించిన ఎన్‌హెచ్‌-71 రహదారి పనుల్లో పెండింగ్‌లో ఉన్న పరిహార చెల్లింపుల అంశాలను శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ మరియు ఎన్‌హెచ్‌-71 సైట్ ఇంజినీర్‌తో కలిసి సంబంధిత ప్రాంతాలను సందర్శించి భూ స్వాధీనం, పరిహార చెల్లింపులు, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభావిత రైతులు, భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులను తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించారు. భూ స్వాధీనం కారణంగా ప్రభావితమైన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల అంశాలను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి ఆలస్యం లేకుండా పరిష్కారం కల్పించాలని ఆదేశించారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారి అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజల అభ్యంతరాలు, సమస్యలను సానుభూతితో పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సూచించారు

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :