నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామ పరిధిలో మదనపల్లి – పీలేరు సెక్షన్కు సంబంధించిన ఎన్హెచ్-71 రహదారి పనుల్లో పెండింగ్లో ఉన్న పరిహార చెల్లింపుల అంశాలను శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ మరియు ఎన్హెచ్-71 సైట్ ఇంజినీర్తో కలిసి సంబంధిత ప్రాంతాలను సందర్శించి భూ స్వాధీనం, పరిహార చెల్లింపులు, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభావిత రైతులు, భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులను తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించారు. భూ స్వాధీనం కారణంగా ప్రభావితమైన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న చెల్లింపుల అంశాలను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి ఆలస్యం లేకుండా పరిష్కారం కల్పించాలని ఆదేశించారు
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారి అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజల అభ్యంతరాలు, సమస్యలను సానుభూతితో పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సూచించారు
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు, ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News