Sunday, 26 July 2026 12:28:54 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

Date : 22 December 2025 05:51 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు గణిత శాస్త్ర విభాగము వారు ఆదర్శనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ కె కొమరగిరి మరియు మ్యాథమెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ పి.రమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. గణితశాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలన్నారు. గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి మూలస్తంభం అని, మానవ నాగరికత పురోగతికి కూడా గణితం కొంతవరకు కారణమని చెప్పొచ్చు అని అన్నారు. న్యూమరాలజీ వంటి అనేక ఆధునిక ఉపన్యాసాలు గణితశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఈ ఘనత శ్రీనివాస రామానుజన్‌కే చెందుతుంది అని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు అని, ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కర 2, శ్రీనివాస రామానుజన్ వంటివారు గణితశాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం, అమోఘం అన్నారు. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్య్ జీనియస్ (Maths Genius)గా చరిత్రలో నిలిచి పోయారు అని అన్నారు. ఆయన జీవితం ఆధారంగా ‘ద మ్యాన్‌ హూ నో ఇన్ఫినిటీ’ (The man who know infinity) పేరుతో సినిమా కూడా వచ్చింది అని అన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రం పై పట్టు సాధించాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యకమం లో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :