Monday, 27 July 2026 03:35:04 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సుస్థిర ఆవిష్కరణ & సహకార డెవోప్స్ పై అతిధి ఉపన్యాసం

న్యూ ఢిల్లీ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాసం

Date : 15 November 2025 08:07 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 15 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగము వారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సుస్థిర ఆవిష్కరణ మరియు సహకార దేవోప్స్ సంస్కృతి మరియు పద్ధతులు అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సత్య పళనిసామి, ఐ.టి కన్సల్టెంట్, NTT డేటా పేమెంట్ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్య పళనిసామి మాట్లాడుతూ డేవ్ ఆప్స్ అనేది సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మరియు ఐటి ఆపరేషన్ల సమన్వయాన్ని పెంచేందుకు, ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వేగంగా గుణాత్మకమైన సేవలను అందించడానికి ఉపయోగించే సాంకేతిక నిర్మాణ మార్పు అని అన్నారు. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో డెవ్‌ఆప్స్ పద్ధతులు సంస్థల ఎదుగుదలకు, మార్పులకు అనుగుణంగా మారడం చాలా అవసరమని అన్నారు. బృందాల మధ్య సహకారాన్ని పెంపొందించి , ప్రక్రియలను క్రమబద్దీకరిస్తూ సుస్థిరమైన ఆవిష్కరణలకు దారితీస్తాయని అన్నారు. డెవ్‌ఆప్స్ టూల్స్, టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టార్టప్‌ల వరకు, పోటీతత్వాన్ని పొందేందుకు డేవ్ ఆప్స్ ను స్వీకరించాయి అని, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మరియు పేస్ బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్ డెలివరీ పైప్‌లైన్‌లను డేవ్ ఆప్స్ ప్రాక్టీస్‌ల చుట్టూ నిర్మించాయి అన్నారు. CI/CD పైప్‌లైన్‌ల అమలు, మరియు బలమైన డెవ్‌ఆప్స్ సంస్కృతిని నిర్మించడం వంటి అంశాలు విద్యార్థులకు పరిశ్రమల యొక్క తాజా పోకడలు, సాంకేతికతలపై అవగాహన కల్పిస్తాయని, వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ, కోఆర్డినేటర్స్ కె.పుగజరాసి, డాక్టర్ కె.నిర్మల దేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :