నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : తంబళ్లపల్లె మండలంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండి నేర రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తానని తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ టిడిపి సీనియర్ నాయకులు రమణ, నరసింహులు నాయుడు, గురుమూర్తి, ఆధ్వర్యంలో ఎస్సైని ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలపై నిఘా పెంచాలని వారు కోరారు. ఎస్సై తంబళ్లపల్లె మండలం లోని నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరు తనకు పూర్తి సహకారం అందివ్వాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిడిపి నాయకులు, మల్లికార్జున నాయుడు, శివకుమార్ , కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News