నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 25 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి మండలంలోని కోసువారిపల్లి, పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లి తో పాటు పలు మారుమూల గ్రామాలలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికినట్లు వైకాపా యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ప్యాయలవారిపల్లి లో నల్లపరెడ్డి దాయాదుల గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రజలతో మమేకమై సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు, యువత పూలమాలలు , దుశ్యాలవులతో ఘనంగా సన్మానించి స్వాగతించారు.అనంతరం ముట్రవారి పల్లెలో కృష్ణారెడ్డి తండ్రి మృతి పై ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. తదుపరి పెద్ద తిప్ప సముద్రం మండలం మద్దయ్యగారి పల్లి ఎంపీటీసీ ఖాదర్ వల్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలున్న కార్యకర్తలు తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైకాపా కార్యకర్తలకు అండగా నిలవడంతోపాటు వారి కష్ట నష్టాలలో పాలుపంచుకొని చేయూతనిస్తానన్నారు. వైకాపా పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గం లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు గతంలో నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎర్రగుండ్లపల్లి శివారెడ్డి, మండల వైకాపా అధ్యక్షుడు చౌడేశ్వర, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News