Monday, 27 July 2026 02:13:44 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మహిళా సంఘాలతో ఆర్థిక పురోభివృద్ధి చెందాలి - డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరరావు

Date : 21 November 2025 07:51 PM Views : 268

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 21 ః మహిళ సంఘాలలోని సభ్యులు భవిష్యత్తులో జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి కృషి చేయాలని జిల్లా డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఐకెపి లో నియోజకవర్గ స్థాయి మహిళా సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయ వనరులు ఎంచుకోవాలన్నారు. మహిళలు పరిశ్రమల వైపు దృష్టి సారించి ప్రాసెసింగ్ యూనిట్లు ద్వారా మార్కెటింగ్ తో భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మహిళా సంఘాలు పరిశ్రమల ఏర్పాటుతో పలు రకాల వ్యాపారాలు వైపు దృష్టిసారించి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. మహిళా సభ్యులు బ్యాంకుల ద్వారా పాలు రకాల రుణాలను పొంది ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లు సహకరిస్తున్నాయని ఇందుకు డిఆర్డిఏ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఏపీడి లక్ష్మి ప్రసాద్ రెడ్డి, ఎపీఎంలు గంగాధర్, శ్రీలక్ష్మి, నాగార్జున, శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష, ఐకెపి అధ్యక్షురాలు రామలక్ష్మి మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :