నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 21 ః మహిళ సంఘాలలోని సభ్యులు భవిష్యత్తులో జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకోవడానికి కృషి చేయాలని జిల్లా డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఐకెపి లో నియోజకవర్గ స్థాయి మహిళా సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయ వనరులు ఎంచుకోవాలన్నారు. మహిళలు పరిశ్రమల వైపు దృష్టి సారించి ప్రాసెసింగ్ యూనిట్లు ద్వారా మార్కెటింగ్ తో భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మహిళా సంఘాలు పరిశ్రమల ఏర్పాటుతో పలు రకాల వ్యాపారాలు వైపు దృష్టిసారించి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. మహిళా సభ్యులు బ్యాంకుల ద్వారా పాలు రకాల రుణాలను పొంది ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లు సహకరిస్తున్నాయని ఇందుకు డిఆర్డిఏ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఏపీడి లక్ష్మి ప్రసాద్ రెడ్డి, ఎపీఎంలు గంగాధర్, శ్రీలక్ష్మి, నాగార్జున, శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష, ఐకెపి అధ్యక్షురాలు రామలక్ష్మి మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News