నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 : తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రం గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అయితే అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య నిర్వహణ పనులు అంతంత మాత్రమే జరుగుతోంది. మండల కేంద్రంలో చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్ తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కేవలం నలుగురే ఉన్నారు. తంబళ్లపల్లె క్రాస్ రోడ్, సిద్ధారెడ్డి గారి పల్లి, కొండ కింద మేకల వారి పల్లి రహదారి, సప్తగిరి బ్యాంకు రహదారి, ఆర్టీసీ బస్టాండు, కోర్టు,మసీదు వీధి, జూనియర్ కాలేజ్, టి ఎన్ అరవింద రెడ్డి కాలనీ, పోలీస్ స్టేషన్, సాలి వీధి, విశ్వనాధ వీధి, వెంకటేశ్వర వీధి, దేవళం వీధి, కృష్ణానగర్, చర్చి వీధి, దళితవాడ, ప్రేమ్ నగర్ తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంతాలలో కేవలం నలుగురు సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయడం కష్ట సాధ్యం. ట్రాక్టర్ సైతం సందు గొందుల్లో వెళ్ళడానికి వీలుపడక మారుమూల వీధుల్లో చెత్త పేరుకు పోతోంది. ప్రతినిత్యం వేల సంఖ్యలో మండల కేంద్రానికి ప్రజలు , అధికారుల రాకపోకలు జరుగుతుంటాయి. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులు వెంటనే స్పందించి అదనంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి మినీ చెత్త తరలించే వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం చెత్త కేంద్రంగా మారడం ఖాయం.
Reporter
Namitha News