Sunday, 26 July 2026 12:27:21 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె కు చెత్త తరలించే వాహనం అవశ్యం

సిబ్బంది కొరత, పారిశుధ్య పనులు ఆలస్యం

Date : 22 February 2026 08:39 AM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 21 : తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రం గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అయితే అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య నిర్వహణ పనులు అంతంత మాత్రమే జరుగుతోంది. మండల కేంద్రంలో చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్ తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కేవలం నలుగురే ఉన్నారు. తంబళ్లపల్లె క్రాస్ రోడ్, సిద్ధారెడ్డి గారి పల్లి, కొండ కింద మేకల వారి పల్లి రహదారి, సప్తగిరి బ్యాంకు రహదారి, ఆర్టీసీ బస్టాండు, కోర్టు,మసీదు వీధి, జూనియర్ కాలేజ్, టి ఎన్ అరవింద రెడ్డి కాలనీ, పోలీస్ స్టేషన్, సాలి వీధి, విశ్వనాధ వీధి, వెంకటేశ్వర వీధి, దేవళం వీధి, కృష్ణానగర్, చర్చి వీధి, దళితవాడ, ప్రేమ్ నగర్ తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంతాలలో కేవలం నలుగురు సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయడం కష్ట సాధ్యం. ట్రాక్టర్ సైతం సందు గొందుల్లో వెళ్ళడానికి వీలుపడక మారుమూల వీధుల్లో చెత్త పేరుకు పోతోంది. ప్రతినిత్యం వేల సంఖ్యలో మండల కేంద్రానికి ప్రజలు , అధికారుల రాకపోకలు జరుగుతుంటాయి. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల పరిషత్ అధికారులు వెంటనే స్పందించి అదనంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించి మినీ చెత్త తరలించే వాహనాన్ని ఏర్పాటు చేయకపోతే తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం చెత్త కేంద్రంగా మారడం ఖాయం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :