Sunday, 26 July 2026 10:36:34 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక శత వార్షికోత్సవం ఉత్సవాలు

హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు

Date : 29 November 2025 06:53 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు - హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు - షేర్ హోల్డర్లు,డిపాజిటర్లు,ఖాతాదారులు,ప్రజలు హాజరై జయప్రదం చేయాలి - టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,డైరెక్టర్లు పిలుపు డిసెంబర్ 3న మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని మదనపల్లి కో - ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో బ్యాంకు డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యా సాగర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల వేడుకలకు బ్యాంకు షేర్ హోల్డర్లు,డిపాజిట్ దారులు,ఖాతాదారులు,ప్రజలు,ప్రముఖులు,విద్యావంతులు వ్యాపారులు,రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.డిసెంబర్ 3వ తేదీ (బుధవారం) మదనపల్లె పట్టణం బుగ్గ కాలువలో గల ఎన్.వి ఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న శతజయంతి ఉత్సవాలకు మంత్రులు,శాసనసభ్యులు,అతిరథ మహారధులను ఆహ్వా నించడం జరిగిందని,వారందరూ హాజరవుతారన్నారు.పుర ప్రజలు,షేర్ హోల్డర్స్,ఖాతా దారులు,డిపాజిట్ దారులు విశ్వాసం,సహకారంతో వందేళ్లు పురోభివృద్ధిలో ముందుకు సాగిందని తెలిపారు.రానున్న రోజుల్లో టౌన్ బ్యాంకుకు మరిన్ని బ్రాంచిలను ఏర్పాటు చేసి,ఖాతాదారులకు మొరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంకు సామాన్య,పేద,మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఆదుకున్న చరిత్రని సొంతం చేసుకుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కో- ఆపరేటివ్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుడా బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు.బ్యాంకు వైస్ చైర్మన్ మరియు పలువురు డైరెక్టర్లు మాట్లాడుతూ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి బాసటగా నిలిచి,వారి అభివృద్ధికి తోడ్పడిందని గుర్తు చేశారు.కావున ఈ ఉత్సవాలకు ప్రజలు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: