నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 : మల్లయ్య కొండ లో ఆదివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ అనంతరం భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నాడు.రాత్రి మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం స్వామివారి సింహ వాహనంపై అశేష ప్రజానీకం తో ఊరేగింపు కార్యక్రమం ఆలయ మాడవీధుల్లో మల్లయ్య దారుల డమరుకుల వైద్యం, మంగళ వాయిద్యాలు, శివమాల భక్తులు, చెక్కభజనలు, కోలాటాలు,శివనామ స్మరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ కట్ట వద్ద స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు సాంప్రదాయ బద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య అశేష జనవాహిని వీక్షిస్తుండగా కన్నుల పండుగగా ఈవో ముని రాజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తాదులు చదివింపులు కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో దంపతులు,వేలాదిగా భక్తజన సందోహం పాల్గొన్నారు
Reporter
Namitha News