నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఆత్మకూరులోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు నేతలు పట్టణ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు.పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.. ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.ఆనం కుమార్తె లీలా కైవల్యా రెడ్డి, వారి మనవళ్ళ తో మంత్రి ఆనం ఈ కార్యక్రమానికి పాల్గొనడం విశేషంగా అలరించింది. టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, బిజెపి కుటుంబ సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, నరసింహారెడ్డి తదితరులతోపాటు అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.. ఆంజనేయ స్వామి భారీ విగ్రహానికి డోన్ ద్వారా పాలాభిషేకం చేయడం విశేషంగా ఆకట్టుకుంది.. ఈ దేవాలయంలో ఆంజనేయస్వామి మహత్యంతో ఇక్కడికి భారీగా భక్తులు వస్తున్నారని వారి ఆశీస్సులతో దినదినభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ నుండి ఈ ఆలయానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని రాష్ట్రంలో పురాతన ఆలయాల మరమ్మత్తుల కోసం మరియు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ పూర్తిగా కృషి చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు
Reporter
Namitha News