నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 23 : తంబళ్లపల్లె మండలం కుక్క రాజు పల్లి దళితవాడలో ప్రతి మాదిగ బిడ్డను చదివించాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, తంబళ్లపల్లె ఇంచార్జ్ వేట మల్లికార్జునల ఆధ్వర్యంలో అణగారిన జాతి నుండి జన్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాడని ఆయన స్ఫూర్తితో మాదిగ రిజర్వేషన్ల ప్రదాత మందకృష్ణ మాదిగ, నరేంద్ర మాదిగ సూచనలతో ప్రతి మాదిగ బిడ్డను చదివించి ఉన్నత స్థాయికి చేరడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో రెడ్డికోట దళితవాడ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News