నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 : తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగు ముట్రవారిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ ఆదేశాలతో గురువారం ఏ.డి డాక్టర్ సుమిత్ర,మండల అధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీలోని 165 పశువులకు బ్యూటాక్స్ పిచికారి, 36 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స, 106 పశువులకు నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. డాక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 8 గ్రామ పంచాయతీలలో పశు ఆరోగ్య స్వరాలు నిర్వహించి 580 పశువులకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాలలో పాడి రైతులు సైతం ఉత్ ఉత్సాహంగా పశువులను శిబిరాలకు తరలించి పశువులకు వైద్యం పొందుతున్నట్లు చెప్పారు. ఈ పశువైద్య శిబిరంలో అంబులెన్స్ డాక్టర్ ఇందు, సహాయకులు రమేష్, శిరీష, దేవేంద్ర, పూర్ణిమ పాడి రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News