నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మే 09 : గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన గంగరాజు ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు మంజూరు పత్రాన్ని గంగరాజు భార్య నాగమణికి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు
Reporter
Namitha News