నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో లెర్న్ ఫ్లూ క్యాంపస్ డ్రైవ్ 23 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో శనివారం 15-11-2025 లెర్న్ ఫ్లూ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు టాప్ కంపెనీ లు వస్తాయని వాటికీ దీటుగా ఇంటర్వూస్ లో తమ నైపుణ్యలను చక్కగా ఉప యోగించుకొని అధిక ప్యాకేజి స్థాయి కి ఎదగాలని ఇంకా ఇలాంటి కంపెనీ లు ఎన్నో వస్తాయని తెలిపారు. ఆఫ్ లైన్ అప్టిట్యూడ్, గ్రూప్ డిస్కషన్,లో 42 మంది ఎంపిక చేసి ఫైనల్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 23 మంది ని ఎంపిక చేసారు. అధిక ప్యాకేజీ 6 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుందని, ఎంపికైన విద్యార్థులు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉంటారని తెలిపారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు ఇలాంటి ఉన్నత స్థాయి లో జరిగే ఉద్యోగ నియామకాలు ద్వారా విద్యార్థులు తమ జీవితాలు కు పూల బాటలు వేసుకోవచ్చని, విశ్వం కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వూస్ ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, హెస్ఓడీ డా. జి. ఎల్. మీనాజ్, డీన్స్, ఎం బిఏ ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్ ఎన్. సోభా రాణి, అధ్యాపకులు, మరియు ఎంబిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News