నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11 : అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యలకు జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా జిల్లాలో భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం జరుగుతుంది. ఈ మేరకు ఏళ్లుగా పరిష్కారం కాని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో -3, పీలేరు సబ్ డివిజన్ పరిధిలో - 01 సమస్యలను పరిష్కరించి, సంబంధిత రైతులకు, ప్రజలకు 22-A భూ సమస్య పరిష్కరించిన ప్రొసీడింగ్లను మంజూరు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 22-A భూ సమస్యలు పరిష్కరించి నలుగురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా అందజేశారు
Reporter
Namitha News