నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప ఆధ్వర్యంలో సివిల్ సప్లై శాఖ సమావేశంలో కృష్ణప్ప మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని అయన సేవలను కొనియాడి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కృష్ణప్ప మాట్లాడుతూ అంటరానితనం, వివక్ష, సామాజిక బానిసత్వ, ఇవన్నీ విధ్వంసం చేసిన మహానుభావుడు అంబేద్కర్. ఆయన మాటలు కోట్ల మందికి బలం అయ్యాయి. కానీ నేడు ఆ అంబేద్కర్ చూపించిన దారిని ప్రభుత్వం మోసం చేస్తోంది.అణగారిన వర్గాల హక్కుల మీద కోతలు, సంక్షేమంపై దాడులు, రిజర్వేషన్లపై రాజకీయాలు… ఇవన్నీ అంబేద్కర్ ఆత్మను కలిచివేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. సమానత్వాన్ని కలగా మార్చిన అంబేద్కర్… నేడు ఆ సమానత్వాన్ని ప్రభుత్వం నినాదంగా మార్చింది, వాస్తవానికి దూరం చేసిందన్నారు. అదేవిధంగా సివిల్ సప్లైల్లో అవినీతి, దోపిడీ వల్ల పేదల బియ్యం కూడా సురక్షితం కాకపోవడం, పనిచేస్తున్న హమాలీలకు తగు సమయంలో జీతాలు ఇవ్వకపోవడం అత్యంత సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అణగారినవారి హక్కులను రక్షించకపోతే CPI వీక్షకుడిలా నిలబోదు – పోరాటం మరింత కఠినమవుతుంది. సివిల్ సప్లై వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. రేషన్ వ్యవస్థ పేదల బతుకుదెరువు—దాన్ని చెడగొట్టే వారిని CPI సహించదన్నారు.” వారు అధికారులను పాలక నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి తిరుమలప్ప, ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాయికిరణ్, సివిల్ సప్లై యూనియన్ కార్యదర్శి గంగులప్ప సివిల్ సప్లై హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News