Sunday, 26 July 2026 07:38:26 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

భవన కార్మికుడు బలవన్మరణం కుటుంబంలో విషాదం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువుల విజ్ఞప్తి

Date : 14 May 2026 03:02 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవన కార్మికుడు బలవన్మరణం కుటుంబంలో విషాదం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువుల విజ్ఞప్తి విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో భవన కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం వెలుగు చూసింది. రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక నిమ్మనపల్లె రోడ్డు దిగువ కమ్మపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న లేట్ నరసింహులు కుమారుడు అగరం సూరి(45) భవన కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో ఏ కారణంతోనో మనస్తాపానికి గురైన సూరి తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని, కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :