Sunday, 26 July 2026 09:52:20 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత పారా అథ్లెట్ క్రీడాకారిణి శివానిని సత్కరించిన జిల్లా కలెక్టర్

Date : 26 January 2026 08:25 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : భారత రాష్ట్రపతి గారి చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును పొందిన పారా అథ్లెట్ క్రీడాకారిణి శివాని ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. జన్మతః కుడి చేయి లేకుండా జన్మించి మదనపల్లి లోని జవహర్ నవోదయ విద్యాలయ సమితి లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పారా అథ్లెట్ క్రీడాకారిణి కుమారి హెచ్. శివాని ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. కుమారి శివాని విభిన్న ప్రతిభావంతుల కేటగిరీ షాట్‌పుట్ మరియు జావెలిన్ త్రో పోటీలలో జాతీయ స్థాయి పారా అథ్లెట్ గా, థాయిలాండ్, బెంగళూరు, గుజరాత్ వంటి దేశీయ-అంతర్జాతీయ వేదికలపై పోటీపడి మూడు బంగారు పతకాలు సాధించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా నుండి కుమారి శివానిని రాష్ట్రీయ బాల పురస్కార అవార్డుకు నామినేట్ చేసిన సందర్భంగా 26 డిసెంబర్ 2025 నాడు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును కుమారి శివాని అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుమారి శివానిని విద్యార్థిని విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, శివాని మరిన్ని బంగారు పథకాలు సాధించాలని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :