Sunday, 26 July 2026 05:31:07 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పోస్టర్ల విడుదల

Date : 23 March 2026 08:55 PM Views : 295

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించి... క్షయ వ్యాధి రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా, మార్చి 24, 2026 నుండి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ – 100 రోజుల కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం లో క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో కలిసి విడుదల చేశారు

ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో మూడు దశల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు . హై రిస్క్ గ్రామాలు, కాంగ్రీగేట్ ప్రదేశాలు మరియు వల్నరబుల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని స్క్రీనింగ్ నిర్వహించ బడుతుంది. ప్రతిరోజు ఒక హై రిస్క్ గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ అన్ని గ్రామాలను కవర్ చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. శిబిరాల్లో ఛాతీ ఎక్స్-రే సహా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడతాయి. స్క్రీనింగ్ చేసిన ప్రతి వ్యక్తి వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ రాధిక మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: