నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 25 : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడి గ్రామ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయి. ముఖ్యమంత్రి ఆదేశాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తక్షణ చర్యలు తీసుకొని డిఎంఎఫ్–సిఎస్ఆర్ నిధుల నుంచి మొత్తం ₹6.70 లక్షలు విడుదల చేశారు. ముగ్గురి లబ్ధిదారుల బంగారు రుణమాఫీ చేశారు: మాలేపాటి హేమలత – ₹75,000, మాలేపాటి ఈశ్వర – ₹1,26,000, ముంతాజ్ బేగం – ₹4,69,000 ఈ చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఉదయం లబ్ధిదారులకు అందజేశారు. రుణమాఫీ పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ లకు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలిపారు.
Reporter
Namitha News