నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 11 : తంబళ్లపల్లె మండలంలో అసాంఘిక కార్యక్రమాలతో పాటు చట్ట వ్యతిరేక చర్యల నిరోధానికి మేము సైతం పోలీసులకు సహకరిస్తున్నట్లు మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ కోసువారిపల్లె పంచాయతీ దేవర బురుజులో ప్రజలతో మమేకమై చట్ట వ్యతిరేక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించరాదని ఎక్కడైనా నిర్వహించినట్లు తెలిస్తే మా దృష్టికి తేవాలని సూచించారు. ఎస్సై సూచనల పై ప్రజలు సైతం స్పందించి పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News