నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 04 : తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలకు చెందిన ఉమ్మడి వారపు సంతల వేలం పాటలు మరో మారు వాయిదా పడ్డాయి. తంబళ్లపల్లె నుండి పరసతోపు పంచాయతీ విడిపోవడంతో వారపు సంత రగడ మొదలైంది. గంగమ్మ గుడి వద్ద దశాబ్దాలుగా జరుగుతున్న వారపు సంత నిర్వహించాలని వేలంపాటదారులు, రెండు పంచాయతీల ప్రజలు కోరడంతో విధి లేని పరిస్థితుల్లో కార్యదర్శిలు శ్రీనివాసరావు, హరి ప్రసాద్ లు వారపు సంత వేలం పాటలు వాయిదా వేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు తరచూ వాయిదా పడటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం తో పంచాయతీ కి రావాల్సిన ప్రధాన ఆదాయ వనరులు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో వారపు సంత వేలం పాటలు నిర్వహించి రెండు పంచాయతీల ఆదాయ వనరుల పెంపుకు సహకరించాల్సి ఉంది.
Reporter
Namitha News