నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారి ఆదేశాల మేరకు నేడు మదనపల్లె లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ సంఘ సంస్కర్త, దాత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు వెంకటరెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పగుచ్చాలతో ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి గారు కేవలం ఒక ప్రాంతానికో, కులానికో పరిమితమైన వారు కాదు. ఆయన సామాజిక సమానత్వం కోసం, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా బర్మాలో వ్యాపారవేత్తగా ఎదిగి, అక్కడ మేయర్గా సేవలందించి *'బర్మా కేసరి'* గా ఖ్యాతి గడించడం గర్వకారణం. విద్య కోసం తన ఆస్తులను, భూములను దానం చేసిన ఆయన గొప్ప మనసు నేటి తరానికి స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు. గాంధీజీ కంటే ముందే కుల నిర్మూలన, వయోజన విద్య వంటి అంశాలపై పోరాడిన ధీశాలి వెంకటరెడ్డి గారని, వారి ఆశయాలను స్మరించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి శంకరమల్లయ్య, ఆర్ఎస్ టిఎఫ్ ఇన్స్పెక్టర్ ఏ. మోహన్ కుమార్, పలువురు ఎస్ఐ లు ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు హోంగార్డులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన సేవలను స్మరిస్తూ పుష్పాంజలి ఘటించారు
Reporter
Namitha News