నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి19 : తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ అభివృద్ధికి ఇన్చార్జి కార్యదర్శి అనిత సహకరించలేదని సమస్యలు పరిష్కరించలేని ఈ పదవి నాకొద్దని సర్పంచ్ సహదేవ రెడ్డి గతవారం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు.దీనిపై స్పందించిన మండల అధికారులు పంచాయతీలో ప్రాథమిక ప్రజా సర్వే నిర్వహించి కొటాల పంచాయతీ అభివృద్ధి కోసం కొటాల ఇన్చార్జి కార్యదర్శిగా జితేంద్ర నాయక్ ను నియమిస్తున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా లు విలేకరులకు తెలిపారు. కార్యదర్శి నియామకంతో సర్పంచ్ సహదేవరెడ్డి తోపాటు గ్రామంలోని ప్రజలు ఎంపీడీవో, ఏవో, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News