నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పట్టాదారు పాసుబుక్కులు పొంది తద్వారా అన్ని రకాల సౌకర్యాలు పొందాలని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. బుధవారం గుండ్లపల్లి సచివాలయంలో నూతన పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని గత రి సర్వేలో జరిగిన పొరపాట్లను రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. నూతన పట్టాదారు పాస్ బుక్కులు ఎలాంటి సమస్యలు లేకుండా రూపొందించినట్లు తెలిపారు. అనంతరం తాసిల్దార్,అధికార పార్టీ నాయకులు రైతులకు పాసుబుక్కుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ప్రభాకర్, టిడిపి నాయకులు కాలా నారాయణ, మీసాల భాస్కర్ నాయుడు, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి,చంద్ర నాయుడు, పెద్ద వీరభద్ర, మధు, వీఆర్ఏలు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News