నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఏ.యస్. పేట - ఫిబ్రవరి 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో వెలిసి ఉన్న ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం లో శివరాత్రి సందర్భంగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు..రాజవోలు గ్రామం లో తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పూజ కైవర్యాలు, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.. దేవస్థానం నిర్మిత ధర్మకర్తలైన చిట్టమూరు.వెంకటరెడ్డి,సుగుణమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. శివరాత్రి రోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం ప్రత్యేక పూజ అమ్మవారి స్వామివారిల విగ్రహాలతో కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించి దేవాలయం వద్ద చిట్టమూరు వెంకటరెడ్డి సారధ్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని భక్తులు భారీగా హాజరై స్వామివారిని అమ్మవారి కళ్యాణాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
Reporter
Namitha News