నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *విశ్వం స్కూల్ సీబీఎస్ఈ లో ఘనంగా నిర్వహించిన సీనియర్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ ఎంపికలు* అభినందించిన విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు విశ్వం స్కూల్ సీబీఎస్ఈ లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిసెంబర్ 18.12. 25 మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎంపికలు నిర్వహించడం జరిగింది. జిల్లా జట్టు కోసం ప్రతిభావంతులైన నెట్ బాల్ ఆటగాళ్లను గుర్తించడం ఈ ఎంపిక కార్యక్రమం లక్ష్యం. వివిధ పాఠశాలల నుంచి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ వయసు ఉన్న విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించి జిల్లా స్థాయి జట్టులో స్థానం కోసం పోటీ పడ్డారు. నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ డి. శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్యాంపస్ లోని ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని ప్రశంసించారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి అన్నమయ్య జిల్లా పిఈటి,పిడి అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ బాబు మరియు ఫిజికల్ డైరెక్టర్ రెడ్డి వరప్రసాద్ గారు క్రీడాకారులను ఉత్సాహంగా పాల్గొనేందుకు ప్రోత్సహించారు. విశ్వం స్కూల్ సీబీఎస్ఈ ప్రిన్సిపాల్ అయినటువంటి రోజ్లిన్ ప్రియా గారు పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఉద్దేశించి ఆటల ప్రాముఖ్యత వివరించి పిల్లలందరూ విజయం సాధించారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో విశ్వం స్కూల్ సీబీఎస్సీ యువ క్రీడాకారులను తమ సామర్ధ్యాలను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించింది. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెంలో 27.12.25 నుండి 28.12.25వ తేదీలలో జరగనున్నాయి. ఈ క్రీడా కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులు బాలురు విభాగం-భరత్, ఇమ్రాన్, సౌఖత్ ,తులసి కుమార్ రెడ్డి, వీర రాఘవరెడ్డి, కాసిమ్, విశాల్, హమీద్ ,హుస్సేన్, హర్ష, రవితేజ, రాకేష్ ,చిన్న చెంచు, జాఫర్, వెంకటరత్నం. బాలికల విభాగం-సాయా రంజిత్, ఐశ్వర్య, హదీ సున్, తేజశ్రీ ,యజ్ఞశ్రీ, హారిక, జోహార్, అలేఖ్య, మేఘన, ముస్కాన్, ఐషా భాను, అపర్ణ,నజియా, ప్రహలక్ష్మి, రిజ్వానా భాను. ఎంపికైన క్రీడాకారులను విశ్వం విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం.ప్రభాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ క్రీడాకారులను అభినందించడం జరిగింది.
Reporter
Namitha News