Sunday, 26 July 2026 10:09:54 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం - తహసీల్దార్ రాము

Date : 30 December 2025 05:53 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలో మంగళవారం ముడి పాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల అవగాహన ఎంతో కీలకమని ఆయన అన్నారు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని చెప్పారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు ఏర్పడకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు పొందారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: