నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 27 : తంబళ్లపల్లి మండలం జుంజరు పెంట పంచాయితీ రామాపురంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య ఉన్న విషయము తెలిసిందే , అయితే అధికారులు వెంటనే స్పందించి, రామాపురానికి బోరు వేసుకోవడానికి మండల్ ఎంపీడీవో ఉషారాణి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్ కు ఆదేశించడంతో గ్రామానికి బోరు వేసుకోవడానికి అనుమతించడంతో ,మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డి చొరవ చూపి వెంటనే బోరు బండిని పిలిపించి బోరు వేయడంతో నీళ్లు సుమారు నాలుగు ఇంచీలు నీళ్ళు పడటంతో సంతోషించారు ,వెంటనే ఆ గ్రామస్తులైనటువంటి మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కల్లూరి రమణయ్య ,బండారు శివకుమార్, వినోద్ కుమార్ ,కొల్లే రామానుజులు అధికారులను అభినందించారు, వెంటనే అధికారులు బోరు మోటర్ బిగించి నీళ్లు అందించినట్లయితే , తాగునీటి సమస్య పరిష్కారమైనట్లేనని గ్రామస్తులు ఆనందం వ్యక్తపరిచారు ,కూటము ప్రభుత్వం తాగినీటి సమస్య పరిష్కరించిందని అభినందించారు
Reporter
Namitha News