నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 01 : తంబళ్లపల్లె మండల కేంద్రం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేలాదిమంది పర్యాటకులతో పర్యాటక కేంద్రాలు జనాలతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ సందర్భంగా మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వెళ్లి మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని తలమానికంగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు కు పర్యాటకుల పోటెత్తారు. ప్రాజెక్టులో అరాకొరా సౌకర్యాలతో ఎంత సంతోషంగా వచ్చిన పర్యాటకులు నిరాశ చెందారు. ప్రాజెక్టు కింద గల పార్కులు, గెస్ట్ హౌస్ లు, నిధుల లేమితో మరమ్మతులు చేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె శ్రీ కోదండ రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మల్లయ్య కొండకు ఆర్టీసీ వన్ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై టి అనిల్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగడం విశేషం
Reporter
Namitha News