Sunday, 26 July 2026 09:58:56 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కోడి పందేలు నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్, ఎస్పీ

Date : 12 January 2026 05:17 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ కోడి పందేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ప్రజలు ఈ అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కోడి పందేలు వల్ల ఆర్థిక నష్టం, సామాజిక సమస్యలు తలెత్తడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, కోడి పందేలు వంటి అక్రమాలకు సహకరించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కానుబిల్లి మాట్లాడుతూ..కోడి పందేలు నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్ కార్యకలాపాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి, అక్రమ కోడి పందేలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కే. గుణశేఖర్ పిల్లె సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :