నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 24 : తంబళ్లపల్లి మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ పొలిమేరమ్మ కు ఆదివారం స్థానిక ప్రజలు దీలు బోనాలు సమర్పించారు. ఉదయం గ్రామానికి చెందిన మహిళలు పొలిమేరలో వెలసిన అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి దీలు బోనాలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, నరసింహులు, రామ్మోహన్, శ్రీనివాసులు, రామాంజులు, జైపాల్, శివకుమార్, శివ, నవీన్, విజయ్ కుమార్, మధు, రమేష్, చిన్న రెడ్డప్ప, రాజశేఖర్, శ్రీనివాసులు, రెడ్డప్ప, పెద్దపల్ల, మల్లికార్జున లు పాల్గొన్నారు
Reporter
Namitha News