నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 10 : రామసముద్రం మండలం చెంబకూరు గ్రామపంచాయతీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం వైద్య అధికారిని జాహ్నవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ నాగవేణి, ఎంపీహెచ్ఈవో రమణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను తెలియజేశారు. అత్యవసర సమయంలో రోగుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, గర్భిణీ స్త్రీల ప్రసూతి సమయంలో సమగ్ర సంరక్షణ ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించటం, రక్తహీనత,తక్కువ వయస్సులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలు, పల్స్ పోలియో,పోషకాహారం,టీకాలు వేయడం తదితర అంశాలపై వైద్య అధికారులకు,ఏఎన్ఎంలకు, అంగన్వాడి,ఆశా కార్యకర్తలకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Reporter
Namitha News